GNTR: రేపు ఉండవల్లి నుంచి తుళ్ళూరు మండలం రాయపూడి వరకు CPM బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాజధాని ప్రాంత CPM నాయకులు ఎం.రవి మంగళవారం తెలిపారు. ఉండవల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి వస్తున్న సందర్భంగా అమరావతి ప్రాంత సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్లేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.