SKLM: రెవెన్యూ సదస్సులతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సరుబుజ్జిలి తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుల ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.