CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.