KKD: ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం కింద 23.10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా లైబ్రరీని నిర్మించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన చదువు వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు ఆమె తెలిపారు.