ప్రకాశం: పంగులూరు మండలంలోని బయట మంజులూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పనులను మంగళవారం తహశీల్దార్ సింగారావు పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక భూముల పరిష్కారానికి రీసర్వేతో సాధ్యమని తెలిపారు. రీసర్వే సమయంలో తమ పొలాల వద్ద రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు