అన్నమయ్య: రాష్ట్రవ్యాప్తంగా ఓ రోజు ముందే చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు అన్నమయ్య జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 30 మండలాల్లో 215650 పింఛన్లకు గాను 204317 పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ వార్డు సత్యవారి సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా పింఛన్ల పంపిణీ 94.74 శాతంలో నిలిచింది.