KKD: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా జిఏవిఎస్వి ప్రసాద్ ఎన్నికయ్యారు. కాకినాడ గాంధీభవన్లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. 146 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో ప్రసాద్ 12 ఓట్ల మెజార్టీతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షున్ని మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ అభినందించారు.