VZM: స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం విజయవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.