W.G: కొవ్వూరు వద్ద బల్లెపాడు నుంచి ఏలూరుకు అధిక లోడుతో వెళుతున్న 2 లారీలను సీజ్ చేసినట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. మంగళవారం కొవ్వూరు సమీపంలో అధికలోడుతో వెళ్తున్న 2 లారీల రికార్డులు పరిశీలించారు. ఈ మేరకు నిర్దేశించిన పరిమాణం కంటే 10 మెట్రిక్ టన్నులు అధిక లోడు చేసి ఏలూరు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. లారీ యజమానులపై కేసు నమోదు చేయమన్నారు.