ATP: ‘జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026’ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుధవారం ఆవిష్కరించారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు రైపర్ కళాశాల వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ‘మై భారత్’ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మార్చి 5న నిర్ణీత సమయానికి పోటీ వేదికకు చేరుకోవాలని సూచించారు.