కృష్ణా: గుడివాడ మండలం దొండపాడు రోడ్డు వద్ద ఎస్సై చంటిబాబు వాహనాలను సోమవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకువెళ్లే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువమంది పిల్లలను ఎక్కించుకొని, రిస్క్ చేయవద్దని అన్నారు. తల్లిదండ్రులు డ్రైవర్లను నమ్మి పిల్లలను ఆటోలలో పంపుతున్నారని, ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా చిన్నారులు చెప్పలేరని అన్నారు.