W.G: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అంబేద్కర్ని పార్లమెంటులో ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటం దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్యని మాల మహానాడు సీనియర్ నేతలు బీరా మధు, సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆచంట గ్రామంలోని స్థానిక పెడపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భీమ్ జై జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.