NLR: సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి సత్కరించారు. పక్షుల పండుగ నిర్వహణకు నిధులు మంజూరు చేయడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయారని తెలిపారు.