ATP: అమరావతిలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఉద్యోగాలు సాధించిన 755 మందికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం డీఎస్సీ నియామకాన్ని పూర్తి చేసిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు.