E.G: రంగంపేటలో రూ. 2.20కోట్లతో చేపట్టే రంగంపేట – గండేపల్లి రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 2017లో రహదారి శంకుస్థాపన చేసి 70 శాతం పనులు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 2.20 కోట్లతో రోడ్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.