VSP: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విశాఖకు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విశాఖలోని పోలీస్ సిబ్బందికి బుధవారం దిశా నిర్ధేశం చేశారు. ఐటీ సెజ్ నుంచి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్ట్మెంట్లలో విస్తృత బందోబస్తు ఉంటుందన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించి యోగా డే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.