VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కాళ్ల మోహనరావు కుటుంబానికి ఆర్థిక సాయమందించారు. గ్రామంలోని మాజీ సైనికులు, సైనిక ఉద్యోగులు జవాన్ కుటుంబానికి రూ.30వేల ఆర్థిక సాయాన్ని సోమవారం అందజేశారు. మోహనరావు ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చి అనారోగ్యంతో మృతి చెందారు.