VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో చేపట్టిన 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ రామలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వార్డులలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షణ చేసి క్లోరినేషన్ జరిగేలా చూడాలని, లీకులను గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.