కృష్ణా: రేషన్ బియ్యం మాయం కేసులో గత వారం రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పేర్ని నాని సోమవారం ప్రత్యక్షమయ్యారు. మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.