KKD: గొల్లప్రోలు మండలంలో కొత్తగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఈఈ ప్రభాకర్ తెలిపారు. దీంతో చెందుర్తి, వన్నెపూడి, కొడవలి, ఎ. విజయనగరం గ్రామాలలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.