ATP: దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు డివిజన్లోని బళ్లారి, హగరి సెక్షన్ను తనిఖీ చేయనున్నారు. అనంతరం నంద్యాలకు బయలుదేరి వెళ్లనున్నారు. జీఎం వెంట గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, తదితర శాఖల అధికారులు పాల్గొనున్నారు.