VZM: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలకు అందిస్తున్న పథకాలు సౌకర్యాలు వివరిస్తూ, నాటుసారా తయారి, వినియోగం వలన కలిగే ప్రభావాలు తెలియజేస్తూ మెంటాడ మండలం కింద గూడెం గ్రామంలో బుధవారం ఆండ్ర ఎస్ఐ సీతారాం ఆద్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.