SKLM: ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. ఆదివారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పదవీ విరమణ పొందిన బొడ్డేపల్లి మధుసూదనరావు దంపతులను ఆయన అభినందించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారని ఆయన కొనియాడారు.