VZM: కల్తీ మద్యం తయారీను నిరసిస్తూ రేపు నియోజకవర్గ కేంద్రంలో నిరసన చేపడుతున్నామని ఎంపీపీ పొట్నూరు ప్రమీల అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో చీపురుపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన చేపడుతామన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.