VZM: జామి మండలం జడ్డేటివలసలో ఆస్తి తగాదా కారణంగా అత్తా, కోడళ్ల మధ్య జరిగిన ఘర్షణలో అత్త గూనూరు కొండమ్మ మృతి చెందింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పెద్ద కోడలు విజయ కనకలక్ష్మి అత్తను నెట్టడంతో ఆమె కిందపడి అక్కడికక్కడే మరణించింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు జామి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.