ATP: జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 1,088 పైగా కేసులు నమోదు చేసి రూ.2,29,250 జరిమానాలు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం సేవిస్తున్న 61మంది, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 16 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు.