NLR: వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి దక్కింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయన చోటు దక్కింది. గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సేవల్ని పార్టీ వినియోగించుకోవాలని భావించడంతో ఆయన CECలో చోటు దక్కింది. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.