కృష్ణా: మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్త్ నారీ – సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ పాల్గొన్నారు.