ప్రకాశం: మహిళ హత్య కేసులో బుధవారం ఒంగోలు పీడీజే కోర్టు జడ్జి భారతి తీర్పు ఇచ్చారు. చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెంకు చెందిన నాగులూరి యాకోబు చీమకుర్తికి చెందిన లక్ష్మీతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఆమెపై అనుమానం పెంచుకొని మద్యం మత్తులో 2020 ఫిబ్రవరి 22న తలపై కర్రతో కొట్టగా ఆమె చనిపోయింది. దీనిపై చీమకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.