KKD: కేంద్రం తగ్గించిన GST రేట్లపై అధికారులు, నాయకులు విస్తృతంగా అవగాహన చేపడుతున్నా వ్యాపారులు పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా నోటుబుక్స్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ తదితర వస్తువులపై పన్ను జీరో శాతం చేసినా పాత ధరలతోనే అమ్ముతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు పన్ను తగ్గింపు ఫలాలు అందడం లేదు.