AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. డిజిటల్ బుక్లో దౌర్జన్యాలకు, వేధింపులకు పాల్పడే వారి పేర్లతో పాటు బాధితుల వివరాలు పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు ఏకశివ పాల్గొన్నారు.