ప్రకాశం: పీసీపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ పీ. రాజాబాబు ఆదేశించారు. గురువారం ఆయన ప్లాంట్ భూమిని పరిశీలించి, రిలయన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లాంట్ నిర్మాణ పురోగతి, కేటాయించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.