ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని రామాలయం వీధిలో ఉన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు మన జిల్లా వార్షికావటం సంతోషిదాయకం అని పేర్కొన్నారు.