ATP: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి వెన్నుపోటు దినం పోస్టర్లను వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు.