కడప: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నగరంలోని ప్రజలు వారి సమస్యలను శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు.