AKP: రోలుగుంట మండలం శరభవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ.. రైతుల భూసమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సదస్సులో రైతులు తమ భూసమస్యలపై అర్జీలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.