E.G: 2026 టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జిల్లాలోని 138 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఒకే సెషన్లో పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ అభ్యర్థులు 13,322 మంది, ప్రైవేట్ అభ్యర్థులు 11,216 మంది ఉన్నారన్నారు.