ATP: పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ నుంచి పుట్లూరు మండల కేంద్రానికి వెళ్లే కెనాల్ కందిగోపుల-పుట్లూరు మధ్య భారీ గండి పడింది. నీరు వృధాగా జాజికొండ వాగుకు వెళ్తున్న విషయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలుసుకొని రాత్రి 10గం సమయంలో గండిని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.