GNTR:మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థినులతో సమస్యలపై చర్చించారు. స్వీయరక్షణ శిక్షణ ఇచ్చారు. బాల్యవివాహం నేరమని, మహిళలపై మోసాలు, సైబర్ నేరాలపై వివరించారు. సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరానికి 112కు కాల్ చేయాలని తెలిపారు.