W.G: జిల్లా ప్రముఖ క్షేత్రమైన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాల సందర్భంగా ఇవాళ అమ్మవారు చాముండి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.