NLR: పేద ప్రజలకు వీపీఆర్ నేత్ర వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు పొలినేని చంద్రబాబు నాయుడు తెలిపారు. చింతలదేవిలోని తూర్పు బ్రాహ్మణపల్లిలో వైద్య సేవలను పరిశీలించి మాట్లడారు. ఇప్పటి వరకు 2,141 మందికి కంటి పరీక్షలు చేశారని, 1034 మందికి అద్దాలు ఇచ్చామన్నారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వీపీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.