గొర్రెల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గోళ్లతోపు గ్రామం రంగనాథపురానికి చెందిన కృష్ణప్ప, కృష్ణమ్మ దంపతులపై శనివారం అదే గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి, బాబురెడ్డి సహా ఆరుగురు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణప్పను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.