TPT: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేకం సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదఅర్చకులు వేదఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి.. తీర్థ ప్రసాదాలు అందించారు.