కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం భక్తులు స్వామివారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,71,280 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 148 మంది స్వామివారిని దర్శించుకున్నార ని పేర్కొన్నారు. 22 ద్విచక్ర వాహన పూజలు నిర్వహించారని, 1260 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.