NLR: కావలి రూరల్ బుడంగుంట కాలనీకి చెందిన తురకా రమణమ్మపై అల్లుడు చల్లా శ్రీనివాసులు కూరగాయలు కత్తితో దాడి చేశాడని ఫిర్యాదు రావడంతో ఎస్సై బాజీ బాబు సోమవారం కేసు నమోదు చేశారు. తన భార్య తనతో కాపురానికి రాలేదని శ్రీనివాసులు అత్తపై దాడి చేశాడు. రమణమ్మ ఏరియా ఆసుపత్రిలో ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.