E.G: అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాజమండ్రి నగర నూతన కమిటీ సభ్యులకు సూచించారు. నూతన కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా తదితరులు మంగళవారం రాజమండ్రిలో ఆయనను కలిసారు. సమర్ధవంతమైన నాయకత్వానికి నగర కమిటీలో స్థానం దక్కిందన్నారు.