ASR: అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు హుకుంపేట మండలం మజ్జివలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రాజెక్టు వ్యతిరేక సభ, భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల భూమి, అడవుల జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు.