కోనసీమ: రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరంలో ఆదివారం అయన మాట్లాడుతూ.. ఓటర్లకు రానుపోను టిక్కెట్లు రిజర్వేషన్ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. ఇవి పార్టీలకతీతంగా జరిగే ఎన్నికన్నారు.