NLR: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలు, పూలు నిల్వ చేసుకునేందుకు రాయితీ ద్వారా నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు.