KNL: సి.బెలగల్ మండలంలోని సచివాలయం-2ను, మండల విస్తరణ అధికారి ఈశ్వరయ్య స్వామి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలోని హాజరు రిజిస్టర్లను సచివాలయ సిబ్బంది పనితీరును, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా 3 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ మెడికల్ లీవ్లో ఉన్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, ప్రత్యమ్నయ మార్గం చూస్తామన్నారు.